ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలనను సందర్శించిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సరోజన. మండలంలోని పందిళ్ళ కుచన పల్లి హుస్నాబాద్ పట్టణంలోని బీజే కాలనీ పాత ఎమ్మార్వో ఆఫీస్ సెంటర్లలో సందర్శించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో అధికారులు ప్రతి ఒక్కరి డాటా ఎంట్రీ చేయాలని ఇందుకు అంగన్వాడీలను ఆశా కార్యకర్తలను సమన్వయం చేసుకొని దర్యాప్తు పూర్తిచేయాలని అన్నారు. అలాగే సమయపాలన పాటించి దరఖాస్తుదారులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని వారికి సూచించారు. ఈ ప్రజా పాలన కార్యక్రమంలో ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. వీరి వెంట అంగన్వాడి, వార్డ్ ఆఫీసర్లు ఆశ మండల అధికారులు పాల్గొన్నారు.