ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు
ఆర్మూర్ యదార్థవాది
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై ఆర్మూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలు
జూన్ 2 నుండి 22వ తేదీ వరకు, జరగబోయే కార్యక్రమాలు, విధి విధానాలను పకడ్బందీగా రూపకల్పన చేసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించడం జరిగింది. అదేవిధంగా ప్రజా ప్రతినిధులతో, ప్రజలతో మమేకమై దశాబ్ది ఉత్సవాలను విజయవంతం అయ్యే విధంగా కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పొందిన లబ్ధిదారుల సైతం భాగస్వామ్యం అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో యంపిడిఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.