26.7 C
Hyderabad
Saturday, May 24, 2025
హోమ్తెలంగాణప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందేలా చూడాలి

ప్రతి ఒక్కరికి కంటి వైద్యం అందేలా చూడాలి

ప్రతి ఒక్కరి కి కంటి వైద్య వైద్యం అందేలా చూడాలి

యదార్థవాది ప్రతినిధి నంగునూరు

పేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందేలా చూడాలని కంటి వెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అజిముద్దిన్ అన్నారు. మంగళవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కంటి వైద్య శిబిరానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమం విజయవంత కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని. ఇందుకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, నంగునూరు మండలంలో నిర్వహించిన కంటి వెలుగు వైద్య శిబిరంలో నర్మెట్టలో 155 మంది తిమ్మాయపల్లిలో 155 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి అక్కడికక్కడే అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు అజిత్, లతా కృష్ణ,, ఎంపీడీవో వేణుగోపాల్, ఏపీఎమ్ఓ ఆంజనేయులు, వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ నాయక్ ,డాక్టర్ అంజలి రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శిలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్