ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి..
యదార్థవాది ప్రతినిధి నిజాంబాద్
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్ శనివారం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు.. ఈ సందర్భంగా అక్కడ వైద్యం పొందుతున్న రోగుల సమస్యలు అడిగి తెలుసుకొని మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ప్రజల ఎదుగుదలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని, వాటిలో ఆరోగ్య శ్రీ పథకం ద్వారా లక్షల మంది పేద ప్రజలకు లబ్ది చేకూరిందని, కేసీఆర్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకన్ని నిర్వీర్యం చేశారని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యానికి వచ్చే వారు అత్యధిక శాతం పేద ప్రజలే ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించి పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన తెలిపారు. మానవత్వ కోణంలోనన్న వైద్యం అందించలాని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కస్తూరి ప్రవిన్, యువజన అధ్యక్షులు అంకార్ గణేష్ , నాయకులు, కారంపూరి రవి, సంతోష్ , ఇస్మాయిల్ ఖాన్, మహిళ నేత శశిరేఖ తదితరులు పాల్గొన్నారు..