30.2 C
Hyderabad
Sunday, February 9, 2025
హోమ్తెలంగాణఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష

ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష

ఫోక్సో కేసులో నిందుతునికి సంవత్సరం జైలు శిక్ష

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి

ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందుతునికి ఒక సంవత్సరం జైలు శిక్ష తో పాటు 1100 జరిమాన విధించింది కోర్టు హుస్నాబాద్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన బోయిని వంశీ (19) 2019 లో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 16 సంవత్సరాల బాలికను స్కూలుకు వెళ్లి వచ్చే క్రమంలో గత కొన్ని రోజుల నుండి పై నేరస్తుడు ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానని మానసికంగా శారీరకంగా హింసించినాడని సదరు బాలిక దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్ఐ సుధాకర్, కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. అనంతరం నెరస్తున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. ఎస్ఐ శ్రీధర్ కేసు పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ వేయడంతో సిద్దిపేట 1 st ఏడీజే పోక్సో కోర్టులో కేసు విచారణ జరిగుతున్నది. శుక్రవారం 1 st అడిషనల్ డిస్ట్రిక్ట్ ఫోక్సో కోర్టు జడ్జి ఇరువురి వాదనలు విన్న తర్వాత నేరస్తుని పై నేరం రుజువైన నందున పై నేరస్తునికి 1 సంవత్సరం జైలు శిక్ష తో పాటు 1100/- రూపాయల జరిమానా విధించారు.నేరస్థునికి జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, తన వాదనలు వినిపించారు, ఎస్ఐ మహేష్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, కానిస్టేబుల్ శివ ప్రసాద్ కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు కీలక పాత్ర వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారులను పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు విధులు నిర్వహించే అధికారులను సిబ్బందిని అభినందించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్