బర్రెలక్క పై దాడి ప్రజాస్వామ్యంపై దాడి: తుమ్మనపల్లి.
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిది
కొల్హాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి అయిన బర్రెలక్క అలియాస్ శిరీష సారథ్యంలో సాగుతున్న ఎన్నికల ప్రచారంలో ఉండగా తన సోదరుడిపై విచక్షణా రహితంగా చేసిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి గానే పరిగణించాలని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అన్నారు ఏ పార్టీకి చెందిన వారైనా ఎంతటి వారైనా గాయ పరిచిన వారిని వెంటనే అదుపులోనికి తీసుకొని చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు, జిల్లా పోలీసు అధికారులు స్పందించి వెంటనే బర్రేలక్కకు రక్షణ సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకే కాకుండా బరిలో నిలిచిన అభ్యర్థులు అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని ఆయన గుర్తు చేశారు. రాజకీయ ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా జరిగిన దాడిని ఖండించాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలను తుమ్మనపల్లి కోరారు.