31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణబిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: ప్రజా ఫ్రంట్.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: ప్రజా ఫ్రంట్.

బిజెపి, బిఆర్ఎస్ పార్టీలను ఓడించాలి: ప్రజా ఫ్రంట్.

-ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న పాలకులను చెమర గీతం పాడాలి.

నల్గొండ యదార్థవాది ప్రతినిది

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మూడవసారి అధికారం కోసం మళ్లీ ఎన్నికల్లోకి  వస్తుందని బిజెపి కూడా ప్రజలకు కళ్ళ బోళ్లి మాటలు చెప్పి ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న బిజెపి బిఆర్ఎస్ పాలనకు చెమర గీతం పాడాలని శనివారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు నక్రేకల్ ప్రెస్ క్లబ్ లో కరపత్రలను విడుదల చేశారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావలి యాదయ్య నల్లగొండ జిల్ల కో కన్వీనర్ గొండ్యాల సైదులు మాట్లాడుతూ నిరుద్యోగుల ఆదివాసుల రైతులు నిత్యం పడుతున్న కష్టాలను మనం చూస్తూనే ఉన్నామని ప్రజా సంఘాల నాయకులపై ప్రశ్నించే గొంతులపై నిత్యం నిర్బంధం ప్రయోగిస్తూ ఉపా కేసులు పెట్టి వేదిస్తున్నదని బంగారు తెలంగాణ అంటూ అప్పుల చేసిండు కోటి ఎగరాలకు నీరు అందించే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎత్తిపోతల పథకం అని  గొప్పలకు పోయాడు  కానీ ఇప్పుడు కాలేశ్వరం కుంగిపోయి గంగలో కలిసిపోయింది అప్పులు ఏమో ప్రజల మీద పడ్డాయి డబ్బు కేసీఆర్ కుటుంబం జేబులు నిండిందని నేటికీ బస్వాపూరం ప్రాజెక్టు ముప్పు బాధితులకు పునరావాసం కల్పించలేదు యాదాద్రి టెంపుల్ అవనితీ మాయమైందని ఆరోపించారు. దళితులకు మూడెకరాల భూమి స్కాం మాయమైందది కేజీ టు పీజీ ఉచిత విద్య డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుద్యోగ భృతి ఆటకి ఎక్కాయని ప్రజల చేతుల్లో ఉన్న భూమి ధరణి ద్వారా గుంజేశాడు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 5 లక్షల కోట్లు అప్పులకు పోయిందని పాలక పార్టి నాయకులు మాత్రం వేలకోట్లకు అధిపతి లయ్యారని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే కేంద్రంలో బిజెపి ప్రభుత్వ వైఖరి మరింత దారుణంగా ఉందని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా ఆశ్రితులకు కట్టబెట్టిందని ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసి బడా బాబులకు గత పదివేలలో 25 లక్షల కోట్ల రుణాలు రద్దు బిజెపి పాలనలో పారదర్శకత ఉండదని రాజ్యాంగం పట్ల గౌరవం లేదు దేశమే ఒక అసoబద్ద చిత్రంగా మారిపోతుందని మత విద్వేషాన్ని రెచ్చగొట్టి దేశాన్ని అగ్ని కీలాల్లోకి తోస్తున్న వారే దేశభక్తి అంటూ ఊరేగింపులు తీస్తారని సామాజిక వాస్తవాలు మాట్లాడుతున్నందుకు  విశ్లేషిస్తున్నందుకు విశ్వవిద్యాలయాల ఆచార్యులను స్వతంత్ర మేధావులను జర్నలిస్టులను కళాకారులను వెంటాడుతుందని అన్నారు. వాస్తవాలు మాట్లాడే వారి మెడమీద కత్తులు వేలాడుతున్నాయని భారతీయ రాష్ట్ర సమితి నిరంకుశ విధానమైతే భారతీయ జనతా పార్టీది మతోన్మాద ఫాసిస్ట్ విధానాలను అమలంబిస్తుందని పౌర ప్రజాతంత్ర హక్కుల రక్షణకు సమానత్వ సాధనకై ప్రజలు ఐక్యమే పాలకవర్గ పార్టీలను నిలదీయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్నాయకులు కావలి యాదయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నంగునూరి రాజు రవి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్