బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కావాలి: చాడ
దేశంలో బీజేపీని ఓడించడానికి ప్రజాస్వామ్యశక్తులను ఏకం చేయడంలో సీపీఐ ప్రధాన పాత్ర వహిస్తది.
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతాం.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడవెంకటరెడ్డి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
రాబోయే ఎంపీ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించడానికి ఇండియా కూటమి తో పాటు బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన భూమిక పోషిస్తదని బీజేపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా శాయశక్తులా పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని లస్థానిక అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో సీపీఐ తో పొత్తు పెట్టుకున్న తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని,మిగతా 4 రాష్ట్రాల్లో పొత్తు ఉంటే అక్కడ కూడా అధికారం వచ్చేమో అని ఆయన అన్నారు.. రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించడానికి అన్ని వామపక్ష, ప్రజాస్వామిక పార్టీ లు, ప్రజాతంత్ర శక్తులు ఏకం అయ్యి బీజేపీని చిత్తుగా ఓడిస్తామని,ఆ పాత్ర సీపీఐగా తీసుకుంటామని మాట్లాడారు..అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో పోటీ చేయడానికి కార్యకర్తలను సన్నద్ధం చేస్తామని ఆయన తెలిపారు..ఈ నెల 26 జరిగే సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు..
ఈ కార్యక్రమంలో సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్,కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్,ఆదరి శ్రీనివాస్, నియోజకవర్గం నాయకులు అందే స్వామి, బొయిని అశోక్, కొయ్యడ సృజన్ కుమార్, చిగురుమామిడి, అక్కన్నపెట,ఎల్కతుర్తి మండలాల సిపిఐ కార్యదర్శులు నాగేల్లి లక్ష్మారెడ్డి, కొమ్ముల భాస్కర్,ఉట్కురి రాములు,ప్రజా సంఘాల నాయకులు కనుకుట్ల శంకర్,జనగాం రాజు కుమార్,జెరిపోతుల జనార్దన్, గూడెం లక్ష్మి, గూడ పద్మ,పిల్లి రజినీ తదితరులు పాల్గొన్నారు.