బీఅర్ఎస్ అవినీతి పాలన అంతమైంది.
కాంగ్రెస్ తోనే తెలంగాణాలో సుపరిపాలన.
అక్బర్ పేట భూంపల్లి యదార్థవాది
తెలంగాణలో కెసిఆర్ అవినీతి కుటుంబ పాలన అంతమైందని ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎల్లన్న గారి వంశీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావాలని మొక్కుకు చెల్లించుకున్నారు ఆదివారం తన స్వగ్రామమైన భూంపల్లి ఎల్లమ్మ ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ గడీల దొరల పాలనకు బిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళా సోదరీమణులందరికీ ఉచిత బస్సు ప్రయాణం వయోభేదం లేకుండా పది లక్షల రూపాయల బీమా పథకాన్ని సోనియమ్మ జన్మదిన సందర్భంగా అమల్లోకి తీసుకురావడంతో ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో విశ్వాసం వచ్చిందన్నారు. దశాబ్దాల పాటు ప్రజల కోసం పనిచేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ సమావేశాలు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.