
బీమా చెక్కు అందచేత..
ఆర్మూర్: 5 జనవరి
ఆర్మూర్ గాయత్రి బ్యాంకు శాఖ యొక్క ఖాతాదారులైన ఉప్పు శ్రీనివాస రావు ప్రమాదవశాత్తు మృతి చెందగా, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాదబీమా మృతుని తండ్రికి ఉప్పు రాములుకు 1లక్ష చెక్కు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, గాయత్రి బ్రాంచి మేనేజర్ శ్రీరామోజి లింబాద్రి లు అందజేశారు…ఎమ్మెల్యే మాట్లాడుతు మధ్యతరగతి, వ్యాపార, ఉద్యోగ ప్రజలకు ఋణాలను ఇస్తున్నారని, నామమాత్రపు చార్జీలతో లక్ష రూపాయల -ప్రమాదబీమా ద్వారా ఖాతాదారుల కుటుంబాలకు ఏంటో మేలౌతుందని తెలిపారు. బ్రాంచి మేనేజర్ శ్రీరామోజి లింబాద్రి మాట్లాడుతూ ఖాతా దారులకు MI- CM AcPS సేవల ద్వారా వినియోగదారులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. సేవింగ్ ఖాతాలు ప్రారంభించుటకు కావలసిన అన్ని బ్యాంకు యందే ఉచితంగా అందిస్తున్నామని, వ్యాపార వృద్ధికై ఋణాలను అందిస్తున్నామని, ఆర్మూర్ పరిసర గ్రామాలలో 17 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించామని, తద్వారా పెన్షనర్లు, ఖాతాదారులు బ్యాంకింగ్ కరస్పాండెంట్ల వద్ద బ్యాంకు లావాదేవీలను నిర్వహించుకోవచ్చని తెలియజేశారు.