బీర్ బాటిల్స్ కోసం హత్య.!
-మద్యానికి బానిసైన యువకుల దాడిలో యువకుడు మృతి..
హైద్రాబాద్ యదార్థవాది
హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బీర్ బాటిల్స్ కోసం గొడవ.. కత్తితో దాడి యువకుడు మృతి.. మృతుడ్ని సాయి వరప్రసాద్గా నిర్ధారించిన పోలీసులు.. జిల్లెలగూడ నుంచి సాయి వరప్రసాద్.. బీరు బాటిల్స్ కొనుక్కుని వెళ్తున్న క్రమంలో కొందరు యువకులు.. అడ్డుకుని బాటిల్స్ తమకు ఇచ్చేయాలని కోరడంతో సాయి వరప్రసాద్ ససేమీరా అనడంతో వాగ్వాదం చోటుచేసుకుందని, ఈ క్రమంలో కత్తితో సాయిపై ఆ యువకులు దాడి చేయగా రక్తపు మడుగులో అక్కడికక్కడే సాయి కుప్పకూలిపోయాడు. బీర్ బాటిల్ హత్య ఉదంతంపై కేసు నమోదు చేసుకుని మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్లను పోలీసులు అనుమానిస్తున్నారు..