బీసీ.ఎస్సీ.ఎస్టీలకు.అండగా కాంగ్రెస్ పార్టీ
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసినందుకు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి కి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి కి, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులు. మండల కేంద్రంలోని బంజర భవనం యందు ముఖ్యమంత్రి.కి ఎమ్మెల్యే.కి పాలాభిషేకం చేయడం జరిగింది సంవత్సరకాలం ప్రజా పాలనలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ ల హామీలలో చాలావరకు హామీలను నెరవేర్చి ప్రజల గొంతు కలకై ప్రజల కొరకు చెప్పిన వాగ్దానం తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వం బంజారా సోదరులకు వెన్నంటూ ఉండి అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తూ రైతుల రుణమాఫీ.రైతులకు 500 బోనస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గ్యాస్ పథకం 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇందిరమ్మ ఇల్లు వంటి అనేక మంచి పథకాలను ప్రజలకు అందిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి కి, సిరికొండ మండల బంజారా సోదరులు నిజామాబాద్ రూరల్ బంజర సోదరులు వెన్నంటి ఉండి రుణపడి ఉంటారని సిరికొండ మండలం నుండి బంజర నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజ్ నాయక్, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, జిల్లా ఎస్టీ సెల్ నాయకులు సంతోష్ నాయక్, మాజీ జడ్పిటిసి మాన్సింగ్ నాయక్, రూరల్ యువజన విభాగం కార్యదర్శి భూపతి నాయక్, నిజామాబాద్ రూరల్ సీనియర్ నాయకులు భూక్యా సంతోష్ నాయక్, నిజామాబాద్ రూరల్ యువ నాయకులు జయరాం నాయక్. మరియు ఇతర బంజారా నాయకులు పాల్గొన్నారు, ప్రభుత్వ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని చెబుతూ హర్షించడం జరిగింది సంవత్సరకాలం పూర్తిచేసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి. ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బంజర సోదరులు అనేకమంది పాల్గొన్నారు.