19.7 C
Hyderabad
Friday, January 24, 2025
హోమ్తెలంగాణభట్టి పాదయాత్రకు ఘన స్వాగతం..

భట్టి పాదయాత్రకు ఘన స్వాగతం..

భట్టి పాదయాత్రకు ఘన స్వాగతం..

* పేద ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి  రావాలి: భట్టి విక్రమార్క

హుస్నాబాద్ యదార్థవాది

హుస్నాబాద్ నియోజక వర్గంలో ఎల్కతూర్తి మండలం సోమవారం భట్టి విక్రమార్క పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో కలిసి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగాలంటే ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర ఇక్కట్లు పోవాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ప్రతి ఏటా కూలీ బంధు పథకం కింద రూ.12 వేలు ఇస్తుందని రూ. 500 కే వంట గ్యాస్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే మొదటి ఏడాది ఏక కాలంలో రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలు రెచ్చగొట్టి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోందని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అని మాయ మాటలు చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి రాష్ట్రంలో అధికారం లోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం లీకేజీల తో నిరుద్యోగుల జీవితాలతో అటలడుకుంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, హన్మకొండ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, దొమ్మాటి సాంబయ్య, అన్వేష్ రెడ్డి, కోట నీలిమ, బీర్ల ఐలయ్య పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్