భారత దేశ భవిష్యత్తు ఓటరు చేతిలో వుంది
ప్రతి భారతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు సద్వినియోగం చేసుకున్నప్పుడే ఓటుకు విలువ: ప్రిన్సిపల్ గణపతి
మెదక్ జిల్లా: జనవరి 25
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని బుదవారం ప్రిన్సిపల్ గణపతి ఓటర్స్ డే కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతు ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛ వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే హక్కు ప్రతి భరతీయ పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అని ప్రిన్సిపల్ అన్నారు, నిర్భయంగా తప్పకుండా ఓటు హక్కును, వినియోగించుకుంటానని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు, ఈ కార్యక్రమంలో లెక్చరర్లు దినకర్, సరిత రాణి, సమీరా, ఎన్ సి సి అధికారులు సుధాకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు విశ్వనాథం, రాజా గౌడ్, అన్నపూర్ణ , విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
