మంచి వైపు మనిషి అడుగు వేయాలి
-అడిషనల్ డీసీపీ మహేందర్
సిద్దిపేట యదార్థవాది
సమాజంలో స్త్రీ, పురుష, కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సమానమేనని గుర్తించాలని సిద్ధిపేట అడిషనల్ డి సి పి మహేందర్ అన్నారు… శుక్రవారం షాప్ స్వార్డ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ఎస్సై లకు, సిఐ లకు జెండర్ సెన్సీటైజేషన్ పై ఒక రోజు వర్క్ షాప్ కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రక్షణకు రూపొందించిన అన్ని చట్టాలను గౌరవించడంతోపాటు ఇతరులు కూడా గౌరవించేలా శక్తివంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు. ప్రతీ పౌరుడు
బాధ్యతాయుతంగా మెలగడానికి మనిషికి ఉండవలసిన లక్షణాలు మానవత్వం నిజాయితీ నిష్పక్షపాతం క్రమశిక్షణగా ఉంటూ అనుకున్న లక్ష్యాలు సాధించాలని, మంచి పనులు చేయడానికి మాత్రమే ముందుండడం ఇతరుల పట్ల గౌరవంగా ఉండడం నమ్మకాలను పెంపొందించు కోవడంలో
బాధ్యతాయుతమైన భావాలను కలిగి ఉండడం సమాజ కోసం పాటుపడే ఒక వ్యక్తి వ్యక్తిలా ఉండడం అంశాల గురించి వివరించారు. మహిళలకు సంబంధించిన కేసులలో స్నేహిత, సఖీ, భరోసా సెంటర్ యొక్క సేవలు మహిళలకు తెలపాలని, మహిళలు గృహహింసకు గురైతే, బయట వేధింపులకు గురైతే వెంటనే స్నేహిత కు సమాచారం అందించేటట్లు చేసి కౌన్సెలింగ్ ద్వారా కాపురాలు నిలబెట్టవచ్చని అన్నారు.. స్నేహిత హెల్ప్ లైన్ నెంబర్ 9494639498 అధికారులందరూ అందుబాటులో ఉంచుకోవాలని మహిళలకు ఏవైనా సమస్యలు ఉంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ ఫోన్ చేసి వారి సహాయం పొందవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరుగుతుందని, మహిళలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో శివకుమారి మాట్లాడుతూ ఆడ మగ వివక్ష లేకుండా పిల్లలను పెంచాలని, నేటి తరం స్త్రీలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, దుబ్బాక సీఐ కృష్ణ, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి, సిసిఎస్ సీఐ సంజయ్, ఎస్బి ఇన్స్పెక్టర్ తిరుపతి, హుస్నాబాద్ సీఐ కిరణ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిసిఆర్పి ఇన్స్పెక్టర్ గురుస్వామి, ఎస్సై లు పాల్గొన్నారు.