మండల ప్రజా పరిషత్ కార్యాలయం కొరకు భవనం పరిశీలించిన అధికారులు
దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 28: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున మండల ప్రజా పరిషత్ కార్యాలయం కొరకు తాహిసిల్దార్ కార్యాలయము వెనకాల ఉన్నటువంటి భవనాన్ని పరిశీలించిన అధికారులు నాయకులు. ఈ భవనంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మండలంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని ఇక్కడ తాసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కూడా దగ్గరగా ఉన్నాయని ప్రజలకు రవాణా పరంగా కూడా అణువుగా ఉంటుందని దీనిలోనే మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధికారులకు వివరించిన స్థానిక నాయకులు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి, దుబ్బాక ఎంపీడీవోలు గణేష్, భాస్కర్ శర్మ, అక్బర్ పేట మాజీ సర్పంచ్ బుచ్చయ్య, భూంపల్లి ఎంపిటిసి అబ్బుల ఉమారాణి బాల గౌడ్, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, కూతురి కుమార్, పోతారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, జంగం నాగరాజు, దేవుని భూమయ్య, పంచాయతీ సెక్రెటరీ అశోక్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.