మత్తు పదార్థాలు రవాణా చేస్తే పీడీ యాక్టు నమోదు చేస్తాం: జిల్లా ఎస్పీ అఖిల్..
జిల్లా మత్తు పదార్థాలు కమిటీ ఆధ్వర్యంలో 32 కేజీల గంజాయిని ఖననం చేసిన పోలీసులు.
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
నిషేధిత గంజాయిని శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టే ప్రక్రియలో పాల్గొన్న జిల్లా మత్తు పదార్థాలు కమిటీ చైర్మన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సభ్యులు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య,కమిటీ సభ్యులు గురువారం సిరిసిల్లలోని రగుడు వద్ద గలా డంప్ యాడ్ లో జిల్లా లోని పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 41 కేసులలో స్వాదీనపరచుకున్న 32 కిలోల 754 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో ఖనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహాజన్ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని, జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం ఖననం జరుగుతుందని తెలిపారు. గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎస్పీ వెంట అదనపు చంద్రయ్య, డీఎస్పీ ఉదయ్ రెడ్డి, ఆర్.ఐ యాదగిరి, టౌన్ సి.ఐ ఉపేందర్, సిబ్బంది పాల్గొన్నారు.