28.2 C
Hyderabad
Saturday, June 14, 2025
హోమ్జాతీయమద్యంతో కుటుంభాలు చిన్న బిన్నం అవుతున్నాయి..కేంద్ర మంత్రి

మద్యంతో కుటుంభాలు చిన్న బిన్నం అవుతున్నాయి..కేంద్ర మంత్రి

మద్యంతో కుటుంభాలు చిన్న బిన్నం అవుతున్నాయి..కేంద్ర మంత్రి

మద్యానికి అలవాటు పడి తన కుమారుడు మరణించాడు,ఇప్పుడు అతని భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఇలాంటి పరిస్థితి తల్లి,తండ్రికి రావద్దని కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసైన వ్యక్తికి పిల్లను ఇవ్వొద్దని కేంద్ర మంత్రి అన్నారు. మద్యానికి బానిసైన అధికారి కంటే ఒక కూలీ చేసుకొనే, రిక్షా కార్మికుడిని, చిన్న చిన్న పనిచేసుకుని తల్లి తండ్రులను పోషించే వారిని పెళ్లికొడుకుగా ఎంపిక చేయడం మంచిదని అన్నారు. తాను ఏంటో ఉన్నత పదవిలో (ఎంపీ), తన భార్య ఎమ్మెల్యేగా ఉండి కూడా మద్యానికి అలవాటైన తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని డీ అడిక్షన్ కేంద్రంలో కూడా చేర్పించామని… ఆ అలవాటును మానేస్తాడనే అనుకున్నామని… ఆ తర్వాత ఆరు నెలలకు పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. కానీ, మళ్లీ మద్యం సేవించడం ప్రారంభించాడని, చివరకు రెండేళ్ల క్రితం చనిపోయాడని, చనిపోయేటప్పుడు అతని కుమారుడికి రెండేళ్ల వయసు, భార్య ఏకాకిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎ తల్లి, తండ్రికి రావద్దని,మీ కూతుర్లని, అక్కచెల్లెళ్లను కాపాడుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్