25.4 C
Hyderabad
Wednesday, May 21, 2025
హోమ్తెలంగాణమనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక "కిరణం"

మనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక “కిరణం”

మనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక “కిరణం”

రాష్ట్రంలోనే తొలి సారిగా మానసిక సమస్యల పరిష్కారం కోసం కిరణం సలహా కేంద్రాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి..

సిరిసిల్ల యదార్థవాది

ఆత్మస్థైర్యం కోల్పోయిన జీవితాల్లో నూతన ఆశలు చిగురించేలా కిరణం మానసిక సలహా కేంద్రం రానన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తుందని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు..కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైకాలజిస్ట్ లు, సైకియాట్రిస్ట్ లు, కౌన్సెలర్ లు, వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3333 ను లాంఛనంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ మానసిక అనారోగ్యాన్ని తొలి దశలోనే గుర్తించడం, ప్రాథమిక చికిత్స, మానసిక మద్దతు, ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి లక్ష్యాలతో మానసిక ఆరోగ్య సేవలను కిరణం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ అందిస్తుందని ఆయన  వెల్లడించారు. ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్,  ఒత్తిడి, ఆతృత, నిరాశ, భయాందోళనలు,  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లు, మత్తు పదార్థాలు,  సంక్షోభ ప్రేరేపిత మానసిక సమస్యలు, గృహ హింస,  మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో మానసిక సమస్యలతో బాధ పడేవారి సమస్యల పరిష్కారానికి ఈ హెల్ప్‌లైన్‌ సేవలు ఉపయోగకరం గా ఉంటాయని టోల్ ప్రీ నంబర్ 24/7 పనిచేస్తుందని తెలిపారు. ఈ నంబర్ కు ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన సైకాలజిస్టు లు, సైక్రియటిస్టు లు, కౌన్సెలర్ లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తారని మానసిక సమస్యలను ఎలా అధిగమించాలో దిశా నిర్దేశనం చేస్తారని అవసరమైన సందర్భంలో జిల్లా  వైద్యశాలలో కౌన్సెలింగ్, చికిత్స కొరకు వారిని పంపడం ద్వారా చికిత్స కొనసాగిస్తారని రోగి కొలుకునేంత వరకు ఫాలో అప్ చికిత్స కొనసాగుతుందని అన్నారు. మానసిక సమస్యలతో బాధపడే జిల్లా లోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథంకు సూచించారు. వైద్యాధికారులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ఉప ఆరోగ్య కేంద్రాలలో ప్రచార గోడ పత్రికలను ప్రదర్శించాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీటిని ప్రదర్శించి ప్రజలందరికీ కిరణం టోల్ ఫ్రీ నెంబర్ తెలిసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరు ఇట్టి సౌకర్యాన్ని సద్వినియాగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు, సైకాలజిస్ట్ కె. పున్నం చందర్, శ్రీనివాస్, సైకియాట్రిస్ట్ లు డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నయీమ, వైద్యాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్