మన ఊరు మన బడి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను తొందరగా పూర్తి చెయ్యాలి: జిల్లా కలెక్టర్
సిద్ధిపేట యదార్థవాది
సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకంలో కేటాయించిన అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎమ్ సి చైర్మన్ లు ఎంఈవో ఎంపిడిఒ ఎంపిఓ ఇంజనీరింగ్ విభాగం ఈఈ డిఈ ఎఈ నిర్మాణ ఎజెన్సీ సర్పంచ్ లతో సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా పాలనాధికారి మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మన బడి పథకంలో పాఠశాలలను ఈనెల చివరికి పనులు పూర్తి చేయ్యాలని ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నకోడూరు, నంగునూరు మండలం లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసెందుకు పంచాయతీ రాజ్ ఈఈ డిఈ లు పర్యవేక్షణ చేయాలని అన్ని విభాగాల అధికారులందరూ సమిష్టిక పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఒ చంద్రమోహన్ రెడ్డి డిఇఓ శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ సిద్దిపేట మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.