25.4 C
Hyderabad
Wednesday, May 21, 2025
హోమ్తెలంగాణమహిళా భద్రత కోసం సీఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: డీజీపీ అంజనీ కుమార్

మహిళా భద్రత కోసం సీఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: డీజీపీ అంజనీ కుమార్

మహిళా భద్రత కోసం సీఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారు: డీజీపీ అంజనీ కుమార్

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా పట్టణంలో భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ అడిషనల్ డిజిపి ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ తో కలసి ప్రారంబించిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం నూతనంగా నిర్మించిన భరోసా, సఖి సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ సీఎం కెసిఆర్ మహిళా భద్రత కోసం ఎంతో కృషి చేస్తున్నారని 2014లో ప్రారంభం చేసిన ఈ సెంటర్ లు దేశానికే ఆదర్శం నిలుస్తున్నాయని అన్నారు..

అడిషనల్ డిజిపి ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ మాట్లాడుతూ రాష్టం మొత్తం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని దేశంలో తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్ లో మహిళా విభాగం కలిగి ఉందని మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి రాష్టంలోని చిన్నారులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు..

రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడరు మహిళా సంరక్షణ కోసం సఖి భరోసా, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ లతో పాటు బాల రక్ష భవన్ కేంద్రం కలిపి ఒకే చోట ఏర్పాటు. ఇక్కడ బాధిత మహళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సిలింగ్ లీగల్ సపోర్ట్ తో కూడిన రక్షణ లభిస్తుందని ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసేలా చర్యలు చేపడతామని తెలిపారు. సిఎస్ఆర్ ద్వారా 1.8 కోట్ల రూపాయలతో నిర్మించిన్ గొవ్రో పెట్రో కెమికల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆకర్షణ లైబ్రెరీని అందించినందుకు మంత్రి వారికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్రం నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మున్సిపల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల తదితరులు.

భరోసా, సఖి కేంద్రం సిద్దిపేట

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్