మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు
తెలంగాణ ఆవిష్కరణకు రావాలి.
-మంత్రి కొన్నం ప్రభాకర్..
హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6: హైదరాబాద్ లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్ లను ఆహ్వానిస్తున్నామని, మా ఆహ్వానాన్ని అంగీకరిస్తు రావాలని రవాణా, సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పిన విధంగా ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను ఈ నేల 9న జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కు ఆహ్వానించడానికి వారి సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాం..వాళ్ళు సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం ఇవ్వడం జరుగుతుందని, వారు ఈ సమావేశానికి రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేస్తున్నామని శుక్రవారం మంత్రి పత్రిక ప్రకటనలు తెలిపారు.