33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణమా గ్రామాన్ని విలీనం చేయవద్దు.

మా గ్రామాన్ని విలీనం చేయవద్దు.

మా గ్రామాన్ని విలీనం చేయవద్దు.

-తప్పుడు అంగికరపత్రంతో కలెక్టర్ కు నివేదిక..

-గ్రామ పంచయతీ తీర్మానం లేకుండా విలీనం చేయవద్దు..

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో
విలీనం చేయవద్దని పెద్ద ఎత్తున ధర్నా చేపటట్టిన సర్పంచ్ బత్తిని సాయిలు..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) గ్రామాన్ని హుస్నాబాద్ మున్సిపాలిటీలో కల్పవద్దని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని సంవత్సర కాలంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు విన్నవిస్తున్న తమ అంగీకారం లేకున్నా గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడానికి తాము అంగీకరించినట్లు కలెక్టర్ కు తప్పుడు ప్రతిపాదనలు పంపించరని అన్నారు. తమ గ్రామంలో 50 శాతం మంది భూమిలేని నిరుపేదలు ఉన్నారని, 600 కు పైగా ఉపాధి హామీ కూలీ పనులు
చేసుకుంటున్నారని మున్సిపాలిటీలో కలిపితే ఇంటి పన్ను, నల్ల పన్నులు పెరిగి గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విలీన ప్రక్రియను విరమించుకోవాలని తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపే ఆలోచనలు ఎమ్మెల్యే సతీష్ బాబు సహృదయంతో విరమించుకోవాలని అన్నారు. ఈ ధర్నాలో ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు బొమ్మగాని శ్రీనివాస్, దొంతర వేణి శ్రీనివాస్, ఆలేటి ఈశ్వర్ రెడ్డి, బత్తిని లక్ష్మి, గీకూరు నాగరాజు, సరిత, రవి, కవిత, ఎల్లయ్య, లలిత, శ్రీనివాస్, రాములు, మణెమ్మ, మోహన్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్