మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం
యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల
వీర్నపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరును పరిశీలించి, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసుల లక్ష్యం అని పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సమర్ధవంతమైన సేవలను అందించాలని, నేరాల నియంత్రణకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపుడు పెట్రొలింగ్, బీట్లు నిర్వహించాలని, బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు. పోలీస్ స్టేషన్ వచ్చిన బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ కేటాయించిన గ్రామలలో వెళ్లి ప్రజలతో మమేకమవుతూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. పోలీసు స్టేషన్ సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావలన్నారు.