మేనమామను హత్య చేసిన అల్లుడు
మెదక్ యదార్థవాది ప్రతినిధి
మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది మేనమామను అల్లుడు కొడవలితో హత్య చేసి నా ఘటన ఆదివారం రాత్రి జరిగింది మెదక్ పట్టణంలోని రాంనగర్ చెందిన మంగలి ప్రభాకర్ 44 సంవత్సరాలు భార్య విజయ విడిచి వెళ్లిపోయింది. చెల్లెలు యశోద, అల్లుడు ఏసు ఒకే చోట ఉంటున్నారు. ఆవారం రాత్రి ఒక విందుకు కలిసి వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన ప్రభాకర్ ఇంట్లో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలిసింది దీంతో అల్లుడు ఏసు కు ప్రభాకర్ కు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహించిన మేనల్లుడు ఏసు ఇంట్లో ఉన్న కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి క్లూస్ టీం తో పరిశీలించగా ఏసు వద్ద జాగిలాలు నిలిచాయి. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావలసి ఉంది.