యుద్ధనౌక గద్దర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
సికింద్రాబాద్ వెంకటాపురం లోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నరు. భట్టి ని చూసి కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురైన గద్దర్ భార్య విమలను ఓదార్చిన భట్టి సందర్భంగా భట్టి మాట్లాడుతూ గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పరు.
పొడుస్తున్న పొద్దు తో.. నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని ఆహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్ర భాగాన నిలిచిన ప్రజా యుద్ధనౌక తెలంగాణ ప్రజా ఉద్యమకారుడు గద్దర్ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గద్దర్ భార్య గుమ్మడి విమల కుమారుడు సూర్యం కుమార్తె వెన్నెల లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం ఇచ్చారు. భట్టి వెంట మల్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నారు