19.7 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచాలకు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపిన బిజెపి నాయకులు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచాలకు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపిన బిజెపి నాయకులు.

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచాలకు అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలిపిన బిజెపి నాయకులు.

యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్న అరికట్టలేని రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తప్పుపడుతూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో గురువారం అంబేద్కర్ సాక్షిగా ఆయన విగ్రహం ముందు భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ మహిళా నాయకురాలు ఆలూరు విజయభారతి, బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బీఆర్ఎస్ గుండాలు బిజెపి దేవరకొండ మండల మహిళా మోర్చ అధ్యక్షురాలు లక్ష్మీ పై లైంగిక వేధింపులకు పాల్పడడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. కేఎంసి ఎంజీఎం లో లౌ జిహాద్ వేధింపులకు, ర్యాగింగ్ కు గురి కావడంతో మనస్థాపము చెంది పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ప్రయత్నం చేయడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. ఈ సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజకీయాలకతీతంగా ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి శిక్షించవలసిన అవసరం ఉందన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళకు గంతులు కట్టుకొని పరిపాలన చేస్తుందా అన్నట్లుగా రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు, వేధింపులు పెరిగిపోతున్న నిమ్మకు నిరేత్తినట్లుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సైతం తోబుట్టువులు, ఓ కూతురు ఉన్నారని. మరి ఈ రాష్ట్ర మహిళలు అలా కనబడడం లేదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూన్నామన్నారు. వెంటనే మహిళల రక్షణకు పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేనట్లయితే ఈ మహిళలే రాబోయే కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో స్వభావికా గౌడ్ పోల్కం వేణు భవాని నవీన్ మందుల బాలు కలిగోట ప్రశాంత్ ఉదయ్ గౌడ్ సాయినాథ్ రెడ్డి రెడ్డి బోయిన దక్షిణామూర్తి యుగంధర్ గుగులోత్ తిరుపతి నాయక్, ఆటో రమేష్, కుబీర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్