రాష్ట ప్రజలపై చల్లని దీవెనలు ఉండాలి: మంత్రి సత్యవతి
మేడారం: యదార్థవాది ప్రతినిది
సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్ పై నిరంతరం అమ్మవారి దీవెనలు ఉండాలని, ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఇతర అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.