28.2 C
Hyderabad
Monday, April 21, 2025
హోమ్Videosరెండు పడకల జాడ ఏది

రెండు పడకల జాడ ఏది

రెండు పడకల జాడ ఏది

ఆర్మూర్ యదార్థవాది

డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు పూర్తి కాని నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే అది ఆర్మూర్ నియోజకవర్గమే అని కాంగ్రెస్ నాయకుడు కోలా వెంకటేష్ విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పై కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు పూర్తి అయిన ఇప్పటివరకు నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఒక్క డబుల్ బెడ్ ఇళ్ళు ఇవ్వలేదని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో కెసిఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేస్తూ అల్లుడు వస్తే ఎక్కడ పడుకుంటారని, అంటూ మేము అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాం అని అన్నారు. కాని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాత్రం తన కోసం అంకాపూర్ లో హైదరాబాద్ లో రాజభవనాలు నిర్మించుకున్నాడని ఇవికాక మినిస్టర్ క్వాటర్స్ లో ఎమ్మెల్యే క్వాటర్స్ లో ఇళ్ళు పొందాడని అన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు మాత్రం ఇప్పటివరకు ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదని ద్వాజమేతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షలు ఇస్తాం అనగానే భయపడి కెసిఆర్ కొత్తగా గృహలక్ష్మి పథకం తెస్తున్నాడు అని సొంత స్థలం ఉన్నవారికి 3 లక్షలు ఇస్తాం అని అంటున్నాడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయ్యుండి కూడ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ది చేకూర్చటం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విఫలమయ్యారని, ఎమ్మెల్యే కొద్దీ రోజుల క్రితం జర్నలిస్ట్ కు జూన్ 18న వారి కుటుంబాలతో గృహలక్ష్మి ప్రవేశం పెడతా అని మీకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తానని అన్నారు. మరి ఈరోజు 24వ తేదీ కానీ ఇప్పటివరకు ఎటువంటి ఇండ్లు ఇవ్వలేరు జర్నలిస్టులకు ఇండ్లు ఎక్కడా అని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజ్జు, జిమ్మి రవి, మందుల పోశెట్టి, బట్టు శంకర్, బాల కిషన్, పాషా, పెద్ద పోశెట్టి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్