రేపు మహిళల రిజర్వేషన్ల కరపత్రాల ఆవిష్కరణ
ఖమ్మం, యదార్థ వాది ప్రతినిధి, డిసెంబర్ 5 : మహి మహిళా రిజర్వేషన్లు ముఖ్యంగా బహుజన మహిళల కర్తవ్యాలు అంశంపై రూపొందించిన కరపత్రాలకు గురువారం వీర నారీమణుల ఆశయ సాధన సమితి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూక్య ఉపేంద్రబాయి, బి.జ్యోతిలు మాట్లాడారు. ఖమ్మం నగరంలోని భద్రాచలం దాసు కళాక్షేత్రంలో శుక్రవారం మహిళా రిజర్వేషన్లు, బహుజన మహిళల ర్తవ్యాలు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలిపారు. తొలుత స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి మయూరి సెంటర్, పాత బస్టాండ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీదుగా భక్త రామదాసు కలెక్షేత్రానికి చేరుకోవటం జరుగుతుందని పేర్కొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు జాన్ బి, త్రివేణి, కార్యదర్శి చందు, సహాయ కార్యదర్శి విజయ, సుశీల తదితరులు పాల్గొన్నారు.