31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణరేవంత్ కు జర గుర్తు జేయుండ్రి..!!

రేవంత్ కు జర గుర్తు జేయుండ్రి..!!

రేవంత్ కు జర గుర్తు జేయుండ్రి..!!

-సీఎంకి పొద్దుగాల చాయి ఇచ్చేవారు ఆయన హామీలను గుర్తు చేయండి

-అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతాం

-సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్య న్యాయమంది

-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందాం

-మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలో పాల్గొని, వారికి సంఘీభావం ప్రకటించిన సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అన్నాడని, కెసిఆర్ ను అధికారం నుంచి దించడానికి ఒక గంట ఎక్స్ట్రా పని చేయాలని మిమ్మల్ని అడిగిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్లో కూర్చొని చాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నావు కదా.. రేవంత్ రెడ్డి కి ఇంకా నెల కాలేదా.. మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం, నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిండు రేవంత్ రెడ్డి. మూడు కోట్ల మంది దేవుళ్లపై ఒట్టు పెట్టి వాళ్ళను కూడా మోసం చేసిండని, బాండ్ పేపర్ల మీద రాసి హామీల అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. రైతులకు 15000 రైతు భరోసా, 4000 ఆసరా, 2500 మహిళలకు ఇస్తామన్నాడు.. అన్ని వర్గాలను మోసం చేసిండు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ ఆక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు..? వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ 13 నాడు హామీ ఇచ్చావు కదా.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తానన్నావు కదా ఇంతవరకు చేయలేదు ఎందుకని,నువ్వు చెప్పిన మాటలే కదా.. నువ్వు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇంద్ర పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేస్తివి.. అసెంబ్లీ ముట్టడి చేస్తే అరెస్టు చేసి మహిళల అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లో పెట్టావు కదా.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఘనంగా చెప్పి, నువ్వు ఇచ్చిన హామీ నీకు గుర్తు చేస్తే అరెస్టు చేస్తావు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజా పాలన అంటే.? అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని, నీ ఏడాది పాలనలో నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి అని అంటే కేసు పెట్టావు..రుణమాఫీ ఎగబెట్టినవ్, రైతు భరోసా  ఎగపెట్టినవ్, 4000 ఆసరా పెన్షన్లు ఎగబెట్టినవ్, మహిళలకు 2500 ఎగ్గొట్టినవ్, నువ్వు ఇచ్చిన అన్ని హామీలు ఎగ్గొట్టినవు కాబట్టి నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్ననని అన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తా..నువ్వు ఒక కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ పేరు ఎగవేతల రేవంత్ రెడ్డే.. విద్యా వలంటీర్లను పూర్తిగా తొలగించారు.. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను పట్టించుకోవడం లేదని, ఒక గంట కాదు నాలుగు గంటలు ఎక్స్ట్రా పని చేద్దాం, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుదాం.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడిద్దాం. బీ ఆర్ ఎస్ ను గెలిపించుకుందామని అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలదీస్తామని, సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్