రైతులకు కొత్త రుణాల ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ గరీమ
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
రైతులకు రుణ మాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ ప్రక్రియ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్.. మంగళవారం సమీకృత జిల్లా కార్యలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారులతో రైతుల రుణమాఫీ ప్రక్రియ, కొత్త రుణాల పంపిణీ చేయాలని సంబందిత అధికారులు, బ్యాంక్ అధికారులను అదేశించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ
ముఖ్యంగా వివిద బ్యాంకులలో రైతు రుణమాఫీలు ఎపిజివిబి బ్యాంకు లో 7876 మంది రైతులకు గాను 33.26కోట్లు, ఎస్బీఐ బ్యాంకు లో 2740మంది రైతులకు గాను 21.92కోట్లు, యుబిఐ బ్యాంకు లో2762 రైతులకు గాను 15.45కోట్లు, ఇతరత్రా బ్యాంకులలో సుమారు 10272అకౌంట్లకు గాను 25కోట్ల పెండింగ్ రైతు రుణమాఫీ నగదును వేగంగా రైతులకు అందజేయ్యాలని ఇప్పటి వరకు జిల్లాలో 1,72,592 మంది రైతులకు గాను 1320.68కోట్లు మంజూరు కాగ 90,471 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ 496.4కోట్లు అకౌంట్ జమ చేయబడ్డాయి. ఇప్పటి వరకు 66,272 రైతులు 394.71కోట్ల నగదు రూపంలో రైతులు వారి ఖాత నుండి తీసుకోవడం జరిగింది. మిగత దాదాపు 11,346 మంది రైతులు క్రాప్ లోన్ రిన్యవల్ చేసుకోవాలని అమే కోరారు. డిబిటి పెల్యుర్ 199 పెండింగ్ లో ఉన్న అకౌంట్లకు రైతు రుణమాఫీ ఫోర్టల్ లో ఎస్బీఐ,ఇతర బ్యాంకు అధికారులు డ్యాక్యమెంట్ అప్లోడ్ చెయ్యాలని లేని యెడల సర్టిఫై బ్యాంకు వారు లీడ్ బ్యాంకు అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని అన్నారు. ఆధార్ నంబర్ లేని గోల్డ్ లోన్ మాఫింగ్ కానీ మరణించిన ఇతర సాంకేతిక లోపాల ద్వారా రుణమాఫీ రాని రైతుల సమస్యలను కమిషనర్ ఆప్ అగ్రికల్చర్ దృష్టికి తీసుకెళ్లలని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఎడిఎ, ఎఓ లు బ్యాంకర్ల దగ్గర నుండి వివిధ గ్రామాల్లో పెండింగ్ జాబితా మాదిరి బ్యాంకు మెనెజర్లతో కుర్చీని క్రాప్ లోన్ రిన్వల్ చేసి రైతులకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరిగా సమావేశాలకు బ్యాంకర్ల ఆర్ఎంలు కచ్చితంగా హాజరుకావాలి లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవు.. కొత్త రుణాలకు అర్హత కలిగిన రైతుల వద్దకు వ్యవసాయ అధికారులు వెళ్లి రైతులకు రుణాలకు సంబంధిత విషయాల గుర్చి తెలపాలని, ఎస్బీఐ, యుబిఐ, ఎపిజివిబి కోఆపరేటివ్ బ్యాంకు రోజుకు 100చొప్పున రుణాలను అందించాలని అన్నారు. రెండవ విడత విధి వ్యాపార రుణాలను పట్టణ పరిధిలో 1329మందికి వారం రోజుల లోపల మెప్మా అధికారుల సహయంతో బ్యాంకు మెనెజర్ లు అందించాలని, సెర్ప్, మెప్మా పరిధిలో బ్యాంకు లీంకెజిలో సంబందించిన ఎంసిపిలు బ్రాంచ్ మెనెజర్ సహకారంతో మంజూరు చెయ్యాలని ఆదేశించారు. సమావేశంలో లీడ్ డిస్ట్రిక్ట్ మెనెజర్ సత్యజిత్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్యా, పీడి మెప్మా హనుమంత రెడ్డి, యుబిఐ ఆర్ఎచ్ వికాస్, ఎపిజివిబి ఆర్ఎం ఉదయ్ కిరణ్, టిజిబి ఆర్ఎం లక్షణ్, బ్యాంకు రిజనల్ అధికారులు, మెప్మా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.