రోడ్డు విస్తరణపై పునరాలోచించాలి..
హుస్నాబాద్: యదార్థవాది ప్రతినిది
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో అర్ అండ్ బి అధికారులు చేపడుతున్న రోడ్ల క్షేత్ర స్తాయిలో పరిశీలించాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. హుస్నాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇండ్లను కోల్పోతున్న భాధిత కుటుంబాలతో కలిసి గడిపె మల్లేశ్ ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రం అందచేశారు.. మాట్లాడుతూ ఆర్ అండ్ బి అధికారులు మార్కింగ్ చేసిన ఇండ్లు, ఇండ్ల స్థలాలను పరిశీలించాలని, హుస్నాబాద్ పట్టణంలో రద్దీలేని బస్ డిపో రోడ్ వెడల్పు చేపట్టావద్దని, ఈ విషయమై ఉన్నతాధికారుల క్షేత్ర స్తాయిలో పరిశీలించాలని మల్లేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు పూర్తిగా కొల్పోతున్న ఆడేపు సూర్యం, వెల్డండి రామ్మోహన్, వెల్డండి భాస్కర్, యాదమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు…