33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణరౌడీ మోహన్ బాబు దగ్గర నుండి పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి

రౌడీ మోహన్ బాబు దగ్గర నుండి పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి

రౌడీ మోహన్ బాబు దగ్గర నుండి పద్మశ్రీ ని వెనక్కి తీసుకోవాలి

-మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి.

-పత్రిక, పాత్రికేయుల స్వేచ్ఛను కాపాడాలి

-టియుడబ్ల్యూజే అధ్యక్షులు రంగాచారి డిమాండ్ 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: మోహన్ బాబు ఇంటి వద్ద మీడియా పాత్రికేయులపై మోహన్ బాబు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా టీయుడబ్ల్యూజే – ఇజేయూ అధ్యక్షులు రంగాచారి తెలిపారు. మంగళవారం  జరిగిన దాడిని మీడియా మీదనే జరిగిన దాడిగానే భావించడం జరుగుతుంది అని అన్నారు. జర్నలిస్టుల పై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలో  ప్రెస్ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓ ఛానెల్ కు చెందిన మీడియా ప్రతినిధి పై  మోహన్ బాబు దాడి  హత్యాయత్నం చేయడానికే ప్రయత్నించినట్లు వారు పేర్కొన్నారు. మోహన్ బాబు సినిమాలోనే విలన్ కాదు నిజ జీవితంలో కూడా విలన్ అని మండి పడ్డారు. ఇది అప్రజాస్వానిక చర్య, పత్రిక స్వేచ్ఛని అరించడమేనని రంగాచారి అన్నారు. మొహన్ బాబు ఆ రౌడీయిజం ప్రదర్శించారన్నారు. వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న వ్యవహారాన్ని వాళ్లే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుని ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకొని వాళ్ళే బయట పెట్టుకున్నారని తెలిపారు. ఆ సందర్భంలో మీడియా తప్పకుండా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్లడం సహజమని, నిజంగా ఆయనకు ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే మా పరిష్కారం చేసుకుంటాం మీరు కొంచెం మాకు సహకరించండి అని అడగొచ్చన్నారు. కానీ ఆయనే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి బౌన్సర్ల ద్వారా మోహన్ బాబు పాత్రికేయుల మీద దాడి చేయడం, వీడియో గ్రాఫర్ మీద దాడి చేయడం కెమెరాలను ధ్వంసం చేయడం ఇది పూర్తిగా పత్రిక, మీడియా మీద జరిగినటువంటి దాడిగానే భావిస్తున్నామన్నారు. ఆయన మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిఅరెస్ట్ చేయాలన్నారు.  ప్రభుత్వంలో ఉండే పెద్దలు కావచ్చు, పోలీసులు కావచ్చు ఇట్లా జరిగినప్పుడు తాత్కాలికంగా నాలుగైదు రోజులు హడావిడి చేయడం తర్వాత వదిలేయడం జరుగుతుందని, ప్రజాస్వామ్యాన్ని పత్రిక స్వేచ్ఛను కాపాడాలని, చట్టాన్ని పరిరక్షించాలన్నారు. మోహన్ బాబును  ఖచ్చితంగా జైల్లో పెట్టాలని, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తేనే ఇలాంటి చర్యలు ఆగిపోతయాన్నారు. పాత్రికేయుడు

రంజిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, దాదాపు పది నుంచి 15 లక్షలు వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని, మోహన్ బాబుకు ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా నేతలు ఫయాజ్ ఆకుల పాండు, నాయిని సంజీవరెడ్డి, చిటుకుల మైసారెడ్డి, రమణారావు, పాతర్ల వెంకటేశం,  రంగధాం పల్లి శ్రీనివాస్ గౌడ్, రఘునందస్వామి, మజ్జు,  దాస శ్రీనివాస్, సాజిద్, సుజిత్ రెడ్డి, రాజు, ఐత శ్రీనివాస్, గందే నాగరాజు, రాజబాబు, శివతేజ, మహేష్, జనార్దన్,  ఇంద్ర శేఖర్, సాయి, మురళీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్