లంచం అడిగితే ఫిర్యాదు చేయండి ఇంచార్జ్ సిపి సింధు శర్మ..!
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు మొదట ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఇన్చార్జి సిపి. సింధు శర్మ సిపి మాట్లాడుతూ ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని, లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఫిర్యాదు అవినీతి నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్.ఏసిపి రాజా వెంకట్ రెడ్డి. ఎసిబి డిఎస్పి శేఖర్ గౌడ్. ఇన్స్పెక్టర్ నాగేష్. సిహెచ్ శ్రీనివాస్. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.