26.7 C
Hyderabad
Saturday, May 24, 2025
హోమ్తెలంగాణలారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు

లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు

లారీల కొరతతో కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం రాశులు

-వేధిస్తున్న లారీల కొరత అయోమయంలో రైతన్నలు..

-సొంత కర్చులతో ధాన్యాన్ని తరలిస్తున్న రైతులు..

దౌల్తాబాద్ యదార్థవాది

పండించిన వరి పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలతో ఆగమయ్యారు. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి సరైన సమయానికి అమ్ముకుందామంటే నెలల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని నిల్వ ఉన్నాయి. మండలం వ్యాప్తంగా ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనీ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీల కొరత తీవ్రంగా వేధిస్తుంది. సరిపడ లారీలు రాకపోవడంతో 25 రోజుల్లో పూర్తి కావాల్సిన ధాన్యం నేటికీ కొనుగోలు కేంద్రాల్లోని నిల్వ ఉన్నాయి. ధాన్యం దిగుమతి చేసుకోవాల్సిన మిల్లర్లు మిల్లుల వద్దకు వచ్చిన ధాన్యం లారీలను దిగుమతి చేసుకోకుండా రెండు మూడు రోజులు అక్కడే మిల్లులోనే ఉంచుకుంటున్నారు. కొంతమంది రైతులు లారీలు రాక సొంత కిరాయిలు పెట్టి ట్రాక్టర్లతో మిల్లుల వద్దకు ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఐకెపి అధికారులు మిల్లర్లతో మాట్లాడితే తరుగు ఉండడంవల్ల లారీలను ఆపుతున్నట్లు మిల్లర్ల యజమానులు అంటున్నారని ఐకేపి అధికారులు తెలుపుతున్నారు. పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉండడంతో రైతులు గ్రామాల్లో వేసుకున్న పంట చిట్టీలు కట్టడానికి డబ్బులు లేక ఆగమైతున్న అన్నదాతలు. ధాన్యం కొనుగోలు త్వరగా జరిగి రైతుల ఖాతాలో డబ్బులు జమైతే ఎరువులు,విత్తనాలు తెచ్చుకోవడానికి వీలుంటుంది. వర్షాకాలం దగ్గర పడడంతో అయోమయంలో రైతన్నలు అగమ్య గోచరంగా అన్నదాతల పరిస్థితి ఇప్పటికైనా మిల్లర్లతో, లారీ యజమానులతో అధికారులు మాట్లాడి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరగా పూర్తి చేయవలసిందిగా రైతులు, ఐకెపి అధికారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్