వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మెదక్ చర్చ్.
ఆసియా ఖండంలోని మెదక్ చర్చ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు.
యదార్థవాది ప్రత్యేక కథనం
కరుణామయుడి దివ్య కోవెల ,నమ్మిన బక్తులకు అండగా వుంటూ తమను ఆసియా ఖండంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాని నిలుపుకున్న చర్చ్ మన మెదక్ చర్చ్ కరునమయుని జన్మను పురస్కరించుకొని క్రిస్మస్ సందర్బంగా ప్రత్యేకతను సంతరించుకుని విదేశాలనుండి సైతం పర్యాటకులను ఆకర్షిస్తున్న మెదక్ చర్చ్ పై ప్రత్యేక కథనం
మెదక్ జిల్లా లో గల దక్షిణ బారత సంఘం చే నిర్వహించబడుతున్న చారిత్రాత్మక కట్టడం, దాదాపు 100 సంవత్సరాల నటి కట్టడనికి నాటి నిర్మాణ శైలికి అద్దంపడుతుంది, లండన్ కు చెందిన పస్నేట్ అనే మత గురువు మెదక్ ప్రాంతానికి వచ్చిన సమయంలో మెతుకు సీమా అంత కరువు,కాటకాలతో అనారోగ్యలతో ఆకలితో వుండగా తన వంతు సహాయం చేయడానికి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు చర్చి నిర్మాణం కోసం నాడు పనికీ ఆహార పథకం లాంటిదానిని ప్రవేశపెట్టి ఈ నిర్మాణంలో అందరిని పలుపంచుకునేల చేసాడు 1914 లో ప్రారంభమైన ఈ చుచ్ దాదాపు పన్నెండు వేల మంది కార్మికులు పది సంవత్సరాలు కష్టపడి దినిని 1924 లో పూర్తిచేశారు. మెదక్ పట్టణంలోని ఈ సుప్రసిద్ధ చర్చ్ అతిసుందర కట్టడంగా పేరుగాంచింది అత్యద్బుతమయిన నిర్మాణ శైలి దిని సొంతం ఆసియా ఖండంలోనే ఉన్నతమైనధిగా గుర్తింపు పొందిన ఈ కేథడ్రాల్ చర్చ్యురఫ్ గోతిక్ శైలిలో నిర్మితమయినది ఇటాలి దేశస్థులతో పటు బారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు కళాకారులూ చర్చి నిర్మాణం పనుల్లో పాలుపంచుకున్నారు 200 అడుగుల పొడవు 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ చర్చ్ కి 175 అడుగుల ఎత్తున్న శికారం ప్రత్యేక ఆకర్షణ పూర్తిగా రాళ్ళూ దంగుసున్నం వినియోగించి 10 సంవత్సరాల పటు నిర్మించిన ఈ చర్చ్ లో ప్రతి అడుగు ఒక కళఖండం పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమయిన ప్రార్థన మందిరాన్ని శికరాన్ని నిర్మించడం నటి పనితనానికి అడ్డం పడుతుంది ఈ చర్చ్ కు వున్నా మరో ప్రత్యేకత చర్చ్ లోపల వున్నా రంగు అద్దాలు ఈ అద్దాల పై ఏసు క్రీస్తు కు సంబంధించిన జనన వృత్తాంతం మొదలు కొని అయన సిలువ అయ్యేంతవరకు తిరిగి లేచెంత వరకు జరిగిన సంఘటనలు ముద్రించారు అంతేకాక కేవలం సూర్య కిరణాలూ ప్రసరించినప్పుడు మాత్రమే ఆ అద్దాల పై ఈ చిత్రాలు ఏర్పడటం గమనార్హం మిగిలిన సమయాలలో ఎంత ప్రయత్నించిన ఇవి కనపడవు ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్ధన చేసుకునే అవకాశం ఈ మందిరంలో వుంది క్రిస్మస్ లాంటి ప్రత్యేక సందర్బాలలో మన రాష్టం నుండే కాకా వివిధ ప్రాంతాల నుండి జనాలు భారిగాబ్ తరలి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా కనీసం 5 నుండి 8 లక్షల మంది రావచ్చునని చర్చ్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ మహాదేవాలయానికి జీవం పోసిన పస్నేట్ పది సంవత్సరాలు కష్టపడి దినిని నిర్మించారు ఇక్కడికి వచ్చిన బక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి కోర్కెలను తీరుస్తూ ఆ ప్రభువు కృపతో చల్లగా ఉంటారని ఆ చర్చ్ పాస్టర్ తెలిపారు.
తమకు ఇక్కడికి రావడంవల్ల ఎంతో ప్రశాంత చేకురిందని ఇది ఒక దేవలయమే కాక పురాతన చారిత్రక కట్టడం ఇక్కడి నిర్మాణం ఎంతో బావుందని ఇటువంటి ప్రాంతాన్ని సందర్శించడం తమకు ఎంతో ఉల్లాసాన్ని అందించిందని అక్కడికి వచ్చిన బక్తులు చెబుతున్నారు.
ఈ క్రిస్మస్ రోజున ఈ చర్చ్ ను సందర్శించుకునే సంఖ్యా మరింత అధికంగా వుంటుంది క్రిస్మస్ రోజు ఉదయం 4 గంటల నుండి ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మొదలు కొని సాయంత్రం 8 గంటల వరకు ఆశిర్వాద ప్రవచనం వుంటుంది ఇక్కడి వచ్చిన వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి చర్చ్ నిర్వాహకులు సిద్ధం చేసారు.
100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ప్రస్తుతం కరుణ విజుపిస్తున్న సందర్భంగా జనాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అలాగే చర్చికి వచ్చే భక్తులకు అందరికీ తగిన సౌకర్యాలు తాత్కాలిక గుడారాలు మరుగుదొడ్లు లాంటివి ఏర్పాట్లు చేయడం జరిగినది ఈ సంవత్సరం సుమారు ఆరు వందల మంది పోలీసుల సిబ్బందితో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
