వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.. ఎమ్మెల్యే
మంచిర్యాల యదార్థవాది
మంచిర్యాల నియోజకవర్గం నస్పూర్ మున్సిపల్ పరిధిలోని సీతారాం పల్లి, విలేజ్ నస్పూర్, హాజిపూర్ మండలం లోని వేంపల్లి లో శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సందేల వెంకటేష్, నస్పూర్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, హాజిపూర్ ఎంపీపీ స్వర్ణలత సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.