విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి
యదార్థవాది ప్రతినిది కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం అద్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఆంధ్రభూమి కాలమిస్ట్ డాక్టర్ లచ్చయ్య మాట్లాడుతూ అందరికి ప్రాదమిక విద్య అందాలంటే ఈ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి అధిక నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఏ పి టి ఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేణుగోపాల్, బామ్ సేఫ్ రాష్ట్ర కార్యదర్శి నరేందర్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు, బాబు, బివిఎం, ఉపాధ్యాయులు సాయి గౌతమ్, సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా జిల్లా నాయకులు ప్రకాష్ దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.