27.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
హోమ్తెలంగాణవిద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్

విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్

విద్యార్థులను సన్మానించిన జిల్లా కలెక్టర్

యదార్థవాది బ్యూరో

కామారెడ్డి లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్.సి. సి. విద్యార్థులు ఆర్. చందు, ఎం. అరుణ గత నెలలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకల సందర్భంగా రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొని కామారెడ్డి చేరుకున్న విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు.
స్థానిక రైల్వే స్టేషన్ నుంచి దేశభక్తి పాటలతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు ప్రధాన రహదారి గుండా భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. కిష్టయ్య మాట్లాడుతూ “ఈ విద్యా సంవత్సరం లో ఆర్ చందు, ఎం అరుణ లు రిపబ్లిక్ డే పేరేడ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి ప్రశంసలు అందుకోవడం కళాశాలకు గర్వకారణం. కామారెడ్డి కీర్తి ప్రతిష్టలను ఢిల్లీలో ఎగురవేయడం అభినందనీయం” అని అన్నారు.ఎన్. సి సి అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ ఎం. రామస్వామి మాట్లాడుతూ “ఇప్పటివరకు కళాశాల నుంచి 38 మంది కాడెట్లు రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొన్నారు. తమ క్యాడేట్స్ ఎంతో మంది భారత సైన్యం త్రివిధ దళాలలో పనిచేస్తున్నార”ని తెలిపారు.
అనంతరం కళాశాలలోని చింతల బాలరాజ్ గౌడ్ మెమోరియల్ ఆడిటోరియంలో విద్యార్థులను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ ఈ. రాజ్ కుమార్, ఐక్యూ ఏ సి సమన్వయకర్త డాక్టర్ పి. రామకృష్ణ, అధ్యాపకులు కే. రాణి డాక్టర్ వి. శంకర్, ఎన్ .రాములు డాక్టర్ కే. కృష్ణమోహన్ , డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ పి. రాజగంభీర్ రావ్, మల్సూర్, సుచరణ్ , స్వాతి, శ్రీలత, శ్రీవేణి, అనిల్ కృష్ణ ,లక్ష్మణ్, వినోద్, అనిల్ కుమార్, రమేశ్ , సూపరింటండెంట్ ఆంజనేయులు, నవీన్, హరీశ్, దేవేందర్, మారుతి, గోవర్ధన్, వసంత, లత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్