విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే పాటుపడాలి.
సిద్ధిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5:
సిద్దిపేట జిల్లా పట్టణంలోని కుషాల్ నగర్ ప్రాథమిక పాఠశాల మండల ప్రజా పరిషత్ స్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. శ్రీమతి శోభా రామచంద్ర రెడ్డి , తన కుమారుడు కార్తీక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు చికెన్ బిర్యానీ రైస్ అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరళ, ఉపాధ్యాయురాలు భవాని విద్యార్థుల పట్ల ఈ సహాయాన్ని వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే పాటుపడాలని, విద్యతోనే పిల్లల ఎదుగుదల విద్యార్థుల అభివృద్ధికి, వారి ఆరోగ్యానికి ఇలాంటి ఆహార పంపిణీ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ స్ఫూర్తితో మరింత మందిని విద్యార్థుల శ్రేయస్సు కోసం ముందుకు రావాలని ఆకాంక్షించారు.