విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం
– విధుల్లో చేరేందుకు ఈ నెల 9 వ తేదీ డెడ్ లైన్
– జేపీఎస్ లకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా నోటీసులు
రాష్ట్రంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను. క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జేపీఎస్ సమ్మెపై సోమవారం ప్రభుత్వ తాజాగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ సుల్తానియా స్పందించారు.సమ్మె విరమించి విధుల్లో చేరాలని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రేపు ( 09-05-2023) సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్ లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేశారు.
ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.
