వైకుంఠ ద్వారం గుండా మంత్రి పాన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు లోని వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు సుందరగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో వైకుంఠ ద్వారం గుండా మంత్రి పాన్నం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ పదేళ్ల పాలన లో ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందక పింఛన్లు రాక ఉద్యోగాలు లేక కష్టాలు పడ్డ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా భగవంతుడు బలాన్ని చేకూర్చాలని రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజక వర్గ అభివృద్ధి తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల హామీ లను నెరవేర్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.