వ్యర్థ పదార్థాలతో విద్యుత్తి పై విద్యార్థులకు అవగాహణ
హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, 5 డిసెంబర్ 2024: స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 8 ,9 తరగతులు విద్యార్థులకు చెత్త ద్వారా విద్యుత్తును ఎలా తయారు చేస్తారు అనే దానిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు జిహెచ్ఎంసి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. లింగోజిగూడ డివిజన్ ఎల్బీనగర్ ప్రభుత్వ పాఠశాల సరూర్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో చదువుతున్న ఎనిమిది తొమ్మిది తరగతుల విద్యార్థులకు జోహార్ నగర్ లోని డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను వేరు చేసి దాని ద్వారా విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారనే దానిపై సుమారు 200 మంది విద్యార్థులను మూడు బస్సుల ద్వారా తీసుకువెళ్లి అక్కడ ఉన్న సిబ్బంది అధికారుల ద్వారా వారికి పూర్తి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఒక్క విద్య పైనే కాకుండా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహనతో పాటు వివిధ ఉత్పత్తులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు విద్యుత్తు ఎలా తయారవుతుంది ఒక్క నీటి ద్వారానే కాకుండా రోడ్డుపై పడి వేసిన చిత్త ద్వారా కూడా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు అనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తే కొంతమేరకైనా ఉపయోగపడుతుంది అన్నారు చిన్ననాటి నుండి ప్రతి విషయాన్ని తెలుసుకొని విద్యార్థి ముందుకెళ్తే సమాజంలో మంచిగా గుర్తింపు ఉంటుందన్నారు ఇటీవల రోడ్డు నిర్మాణంలో సిమెంటు కంకర ఇసుక ఎలా వేస్తే రోడ్డు నిర్మాణం జరుగుతుందనే దానిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు గత మూడు రోజులుగా అనేక కార్యక్రమాలను డివిజన్ పరిధిలో చేపడుతున్నట్లు తెలిపారు.