33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణశాంతియుతంగా ఎన్నికలు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.

శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.

శాంతియుతంగా ఎన్నికలు జరగడానికి
అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి.

-జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్

పెద్దపల్లి యదార్థ వాది ప్రతినిది

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ కోరారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి, డిసిపి వైభవ్ గైక్వాడ్ లతో కలిసి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని, సి-విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చని, 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు 24 గంటల పాటు నమోదు చేయవచ్చని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రస్తుతం ఉన్న పనులు, పథకాలు మాత్రమే కొనసాగుతాయని కొత్త పనులు, పథకాలు ప్రారంభించడం జరగదని తెలిపారు. రాజకీయ పార్టీలకు నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, సువిధా యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని, రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలు, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించవద్దని ఎన్నికల అధికారి తెలిపారు. కుల, మతాల మధ్య విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు, తప్పుడు ప్రచారాలు చేసే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123, ఐపిసి సెక్షన్ 171 ప్రకారం అభ్యర్థులపై 6 సంవత్సరాలు నిషేదం ఉంటుందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అక్టోబర్ 30 వరకు నూతన ఓటరు నమోదు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ఓటరు జాబితాలో పేర్లు లేకుండా ఎవరైనా అర్హులైన ఓటర్లు ఉంటే వెంటనే దరఖాస్తు సమర్పించాలని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో ఎక్కువమంది సమావేశాలు నిర్వహణకు పోటీ పడితే ముందు దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వివిఐపి లు, విఐపి ల పర్యటన సమయంలో స్థానిక పోలీస్ అధికారులతో పార్టీ నాయకులు సమన్వయం తో పనిచేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమావేశాలు నిర్వహించుకోవాలని సామాజిక మాధ్యమాలలో విద్వేషాలను పెంచే విధంగా పోస్టులు పెట్టడం, ఇతరులను దూషించడం, బెదిరింపులకు గురి చేయడం వంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీలు ఎడ్ల మహేష్, శ్రీనివాస్ రావు, సి.ఐ. అనిల్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్