శ్రీ దత్తాత్రేయ విగ్రహ ప్రతిష్ట
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిది
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం లో శ్రీశ్రీశ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా భక్తులు మంగళవారం శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహానికి జలాభిషేకం అఖండ దీపారాధన చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి శివ కోటి పంతులు మాట్లాడుతూ బుధవారం మండపారాధన యంత్ర ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట మరియు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత కడియాల ఈశ్వరప్ప ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు ఆలయ పూజారులు పాల్గొన్నారు