33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణసమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం 

సమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం 

సమయపాలన పాటిద్దాం.. ప్రజల నుండి వినతుల స్వీకరిద్దాం 

-జిల్లా అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి వివిధ శాఖల అధికారులు సమయపాలనకు ప్రాధాన్యత నివ్వాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజావాణిలో సంబంధిత డిఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులతో  కలిసి వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చిన ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని అధికారులందరూ ప్రజావాణి రోజున 10-15 నిమిషాలకల్లా హాజరు కావాలని తెలిపారు.  డబల్ బెడ్ రూమ్ ఇండ్లు-06, ధరణి- 23, పింఛన్లు-02, ఇతర సమస్యలు-22 మొత్తం 53 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును మీ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించి, మీ పరిధి కాని సమస్యలపై ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలన్నారు. 

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్