సింగరేణి కాపర్ వైర్ దొంగలను పట్టుకున్న పోలీసులు
పెద్దపల్లి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: అక్రమంగా సింగరేణి కాపర్ వైర్ దొంగిలించి రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొన్న పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడికే 2 ఇంక్లైన్ మైన్ పరిధిలో ఉన్న సింగరేణి కి సంబంధించిన కాపర్ వైర్ ని దొంగిలించి అక్రమంగా హైదరాబాద్కు రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది గోదావరిఖని అడ్డగుంటపల్లి వద్ద అనుమాన స్పదంగా వస్తున్న ఒక మహేంద్ర ట్రాలీ ని ఆపి తనిఖి నిర్వహించగా అందులో 65 కిలోల కాపర్ వైర్ ను గుర్తించడం జరిగింది. డ్రైవర్ను అందులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి పేర్లు దొంతుల శ్రీనివాస్, ముత్యాల ఐలయ్య డ్రైవర్ అని తెలిపి రెండు రోజుల క్రితం 2 ఇంక్లైన్ గోదావరిఖని మైన్ నుండి దొంగలు తనం చేసి దొంతుల శ్రీనివాస్ స్క్రాప్ దుకాణంలో ఉంచి ఈరోజు ఉదయం సమయంలో అక్రమంగా హైదరాబాద్కు తరలిస్తున్నామని తెలుపడం జరిగింది. వెంటనే నిందితులిద్దరిని మరియు ట్రాలీ ని, అందులో ఉన్న కాపర్ వైర్ సాధించేసుకొని తదుపరి విచారణ నిమిత్తం గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ వారికి అప్పగించారు.