28.2 C
Hyderabad
Wednesday, June 18, 2025
హోమ్తెలంగాణ"సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం" గ్రంథావిష్కరణ

“సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం” గ్రంథావిష్కరణ

యదార్థవాది ప్రతినిది సిద్ధిపేట

జిల్లా కేంద్రమైన సిద్ధిపేట విపంచి కళా ఆడిటోరియంలో గురువారం సాయంత్రం తెలంగాణ సారస్వత పరిషత్తు సిద్ధిపేట జిల్లా ఉత్తవం “సిద్ధిపేట జిల్లా సమగ్ర స్వరూపం” గ్రంథావిష్కరణ, సిద్ధిపేట వైభవం కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు హాజరై పుస్తక ఆవిష్కరించారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య, కన్వీనర్ కొండి మల్లారెడ్డి, డాక్టర్ తైదల అంజయ్య, ఇతర కోర్ కమిటీ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్