సినిమా థియేటర్ కు సంబంధం లేదటా.!
ప్రీమియర్ షో డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారటా.!
ప్రభుత్వానిదే బాధ్యత.. అంటున్న సంధ్య థియేటర్ యజమాని..
గత 5న పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే..
పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు.
అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని థియేటర్ యజమాని తెలిపారు.